అక్క వెళ్ళిపోయింది
నలుగురిని ముగ్గురు చేస్తూ..
రెండేళ్ళ కిందటి జాజిమల్లి పాఠకులకి మా నలుగురక్కాచెల్లెళ్ళ పై నేను రాసిన కథలు గుర్తు ఉండే ఉంటాయి. ఒక ఖాళీని తడుముకునే ప్రయత్నం చేస్తుంటే అక్క వ్యక్తిత్వపు హిమవన్నగం దొరికింది మాకు. దానినే పుస్తక రూపంలో మిత్రులందరితో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. పిడిఎఫ్ లో ఉన్న ఈ పుస్తకాన్ని మీకు అందుబాటులో ఉంచుతున్నాను
మల్లీశ్వరి